Tuesday, February 1, 2011

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా

రెండుసార్లు కంటతడి పెట్టుకున్న ఇలియానా 


ఈ వారం రోజుల్లో ఇలియానా రెండు సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత పని ఎందుకు జరిగింది అనుకుంటున్నారా?... ఆ విషయానికే వస్తున్నాం.. వారం రోజుల క్రితం ఈ గోవా బ్యూటీ ‘మై సిస్టర్స్ కీపర్’ అనే ఇంగ్లిష్ సినిమా చూశారట. ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఇలియానా కళ్లు చెమర్చేలా చేశాయి. నటీనటుల నటన, కథ ఈ గోవా బ్యూటీని అంతగా కదిలించాయట. ఇది జరిగిన నాలుగు రోజులకు మళ్లీ ఇలియానా కళ్లు వర్షించాయి. ఈసారి వేరే సినిమా వలన కాదు.. తను చేసిన ‘నేను నా రాక్షసి’ కోసం ఇలియానా ఏడ్చారు. ఈ ఏడుపుకి కారణం సదరు సినిమా షూటింగ్ పూర్తవ్వడమే. రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి సీన్ తీయడం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ ‘పేకప్’ చెప్పగానే... ఇలియానా చాలా బాధపడ్డారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘పోకిరి తర్వాత మళ్లీ పూరీతో చేసిన చిత్రం ఇది. ఆయనతో రెండో సినిమా చేయడం అనేది నా కల. ఈ చిత్రంలో పూరి నాకు మంచి పాత్ర ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక, రానా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను సెట్లో ఉంటే చాలా సందడిగా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడే పూర్తయ్యిందా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ యూనిట్‌తో నా ప్రయాణం చాలా సాఫీగా, ఆనందంగా సాగింది. అందుకే ఈ చిత్రం నాకు చాలా చాలా ప్రత్యేకం. ‘నేను నా రాక్షసి’ విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. పూరి, నా కాంబినేషన్‌లో రూపొందిన ‘పోకిరి’ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ మా కాంబినేషనలో మరో సక్సెస్ చవి చూడబోతున్నాం’’ అన్నారు.

No comments:

Post a Comment