Friday, December 24, 2010

మళ్లీ 'మర్డర్‌'

మళ్లీ 'మర్డర్‌'


మ్రాన్‌ హష్మి, మల్లికా శెరావత్‌ నటించిన 'మర్డర్‌' సినిమా అయిదేళ్ల కిందట విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు రూపొందించే పనిలో పడ్డారు దర్శకుడు మోహిత్‌ సూరి. తాజా చిత్రంలో కథానాయకుడిగా ఇమ్రాన్‌ హష్మి కొనసాగుతున్నా.. నాయికగా కొత్త ముఖానికి చోటిచ్చారు. మల్లికా శెరావత్‌ స్థానాన్ని జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఆక్రమించింది. దర్శకుడు మాట్లాడుతూ ''మర్డర్‌ తరవాత దానికి రెండో భాగం అంటే ప్రేక్షకులు అంచనాలు పెంచుకొంటారు. వారికి తగ్గట్లు కథ సిద్ధం చేసుకున్నాను. మళ్లీ మల్లికానే నాయికగా తీసుకొంటే బాగుండదేమో అనిపించి కొత్త ముఖాన్ని చూపించాలనుకున్నాను. జాక్వెలైన్‌, ఇమ్రాన్‌ హష్మి మధ్య కొన్ని శృంగార సన్నివేశాల్ని చిత్రీకరించిన తరవాతే ఆమెను ఎంపిక చేసుకొన్నాను. తెర మీద వారిద్దరినీ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతార''ని వెల్లడించారు. 

No comments:

Post a Comment