కంగన ఒప్పుకోలేదు!
కంగనా రనౌత్ కథానాయికగా బాలాజీ టెలీ ఫిలిమ్స్ సంస్థ 'రాగిని ఎం.ఎం.ఎస్' అనే చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఏక్తా కపూర్ నిర్మాత. గతంలో కంగన వీరి నిర్మాణంలో వచ్చిన 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి' చిత్రంలో నటించారు. అందుకే తాజా చిత్రంలోనూ ఆమెనే నాయికగా తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే కంగన సుముఖంగా లేదు. ఆమె సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం.. ఆమె పోషించాల్సిన పాత్ర ప్రధానమైనదే అయినా.. కథలో ఎక్కువ భాగం శృంగారం, అంగాంగ ప్రదర్శనలకే ప్రాముఖ్యం ఉండటంతో ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించనట్లు తెలిసింది. 'ఫ్యాషన్' చిత్రంలో ఆమె నటనకు గతంలో అవార్డులు వచ్చిన తరవాత కంగన ఆచితూచి సినిమాల్ని ఎంపిక చేసుకొంటోంది. దీనికి నిదర్శనమే 'రాగిని ఎం.ఎం.ఎస్.' సినిమాను వదులుకోవడం! ఇప్పుడు ఏక్తా మరో నాయిక కోసం అన్వేషణ మొదలుపెడుతోంది.
No comments:
Post a Comment