Thursday, December 30, 2010

ప్రియాంక వద్దు!

ప్రియాంక వద్దు!


చేతన్‌ భగత్‌ రాసిన నవల 'టూ స్టేట్స్‌' ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. తొలుత ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌, ప్రియాంక చోప్రా నాయకానాయికలుగా ఎంపికయ్యారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో సాజిద్‌ నదియడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడు కూడా మారారు. కథానాయకుడిగా షారుఖ్‌ రావడంతో విశాల్‌ భరద్వాజ్‌ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇందులో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తారు. అంతేకాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరించబోతున్నారు. నాయికగా ప్రియాంకను కూడా తప్పించమని షారుఖ్‌ దర్శకుడికి సూచించారట. ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు. దీంతో కొత్త నాయిక కోసం అన్వేషణ మొదలుపెట్టారు విశాల్‌.

No comments:

Post a Comment